15, నవంబర్ 2011, మంగళవారం

బందు

రాజకీయలేందో, తెలంగానేందో, ఆంధ్రదేశామేందో నాకు తెలవదు కూలినాలి చేసు కుంటొన్ని నాకేం ఎర్క నాయన.
ఎవడెడ సత్తేంది, కొంపకు 200  రూపాలతో ఎల్తే గాని కూడు దొరకదు.
దిక్కుమాలిన బందోటొచ్చింది.
రెండు దినాల సంధి అడ్డ మీద మేస్త్రి కాడ్నే కూసున్నం.
ఈరిగాన్ని 500  ఇయ్యిర అని అడుగుతే
లెవ్వు పెద్నయన 200  ఉన్నాయి అని సేతిల బెట్టిండు.
సాయంత్రం అయితే బంధు లేదు గిన్దులేదు అని మోటార్ బండి మీది గిరి గిరి వాసులు కొచ్చేవోడికి
రెండు దినలసంది చిట్టి గట్టలే 100  ఆడే తన్నుక పోతాడు.
పెళ్ళాం ఏమంటుందో ఏమో,
పొద్దున్నే నర్సాక్కోల్లింట్ల కెళ్ళి పావు సేరు పప్పు పట్టుకొచ్చింది.
ఇయ్యాల గడిచింది.
బందని లింగడు గూడ కూరగాయల డబ్బా మూసిండు,
లచ్మి దగ్గరికి పోతే ఇదే సందునకొని దాని ఇష్టమున్నంత సేప్తది రెట్లు.
ఐన ఏంచేద్దాం పెళ్ళాం ఊరుకోదు, కడుపు కాలక మానదు.
ఉన్న వంద కూడా గీయల్నే ఐపోయే.
గీ బంధు రేపు కూడా గిట్లనే ఉంటె ఇగ పొద్దుగడిసినట్టే..
 Tuesday, August 9, 2011 at 7:45pm

కామెంట్‌లు లేవు: